తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
ఈసీ డమ్మీగా మారిందని ఆరోపించారు.
ఎన్నికల సంఘాన్ని బీజేపీ( BJP ) ఇంటి సంస్థగా మార్చుకుందంటూ జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా అని చెప్పారు.అన్ని కులాలు బీజేపీకి దూరం అవుతున్నాయనే అమిత్ షా( Amit Shah ) గాంధీభవన్ కు ఢిల్లీ పోలీసులను పంపారని విమర్శించారు.
అయితే అమిత్ షా పేరిట డీప్ ఫేక్ వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో నిన్న గాంధీభవన్ కు వచ్చిన ఢిల్లీ పోలీసులు పలువురు నేతలకు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.