నందికొట్కూరు సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం జగన్( CM YS Jagan ) పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

 Chandrababu Serious Comments On Cm Jagan In Nandikotkur Sabha, Chandrababu, Cm J-TeluguStop.com

బాబాయ్ నీ గొడ్డలితో చంపినది ఎవరని నిలదీశారు.బాబాయ్ ను చంపి ఆయన కూతురు సునీత పైనే కేసు పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.

న్యాయం చేయాలని సునీత అడిగితే కేసు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.గత ఎన్నికలలో సీఎం జగన్ ఆడిన కోడి కత్తి డ్రామా( Kodi Kathi Drama ) ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

కోడి కత్తి, గులకరాయితో హత్యాయత్నం తానే చేశానని జగన్ అన్నాడని గుర్తు చేశారు.చంపేది వాళ్లు… నెపం నెట్టేది వేరే వాళ్ళపైన అని విమర్శించారు.జగన్ వృత్తి, ప్రవృత్తి కూడా అదేనని విమర్శించారు.జగన్ డ్రామాల రాయుడని ( Jagan Drama Rayudu )సానుభూతి రాయుడని సెటైర్లు వేశారు.ఐదేళ్లలో ప్రజల జీవితాలను సర్వం నాశనం చేశారు.వచ్చే ఎన్నికలలో జగన్ కు శిక్ష వేసే బాధ్యత.

ప్రజలదే.డ్రైవింగ్ తెలియని వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు.

జగన్ కి సంపద సృష్టించడం తెలియదు.వైసీపీ హయాంలో కూల్చివేతలు, దాడులు తప్ప ఇంకేమీ లేవు అంటూ.

చంద్రబాబు మండి పడటం జరిగింది.వచ్చే ఎన్నికలలో గెలిపిస్తే 14 సంవత్సరాలలో ఎంతైతే కష్టపడి పని చేశానో.

అదే రకంగా ఐదేళ్లలో పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube