అమేథీ( Amethi )లో పోటీకి కాంగ్రెస్ భయపడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా( Amit Shah ) అన్నారు.ఈ క్రమంలోనే ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
రిజర్వేషన్లపై కూడా కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని అమిత్ షా ఆరోపించారు.ఫేక్ వీడియో ప్రచారం వెనుక రాహుల్ గాంధీ( Rahul Gandhi ) హస్తం ఉందని ఆరోపణలు చేశారు.
అయితే తాము కాంగ్రెస్ తరహాలో ఎమర్జెన్సీ విధించలేదని చెప్పారు. కాంగ్రెస్ ఫ్రస్టేషన్ లో ఉందన్న అమిత్ షా తమ నినాదాలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సుమారు నాలుగు వందల స్థానాల్లో ఎన్డీయే విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.