తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ గర్జన విజయవంతంగా పూర్తి అవ్వడంతో వైసీపీ కూడా ఇప్పుడు బీసీ గజర్జన చేసేందుకు సిద్ధం అవుతోంది.ఈ నేపథ్యంలో .
పార్టీ నేతలతో మాట్లాడిన జగన్ … ఫిబ్రవరి 19 వ తేదీన బిసిగర్జన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.ఈ మేరకు ఆ పార్టీ బిసి సెల్అధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఈ వివరాలు తెలియజేసారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఈ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అధ్యయన సమావేశాలు నిర్వహించామని… అధ్యయన కమిటీ ద్వారా అనేక అంశాలతో కూడిన నివేదికను సోమవారం వైఎస్ జగన్కు అందజేశామని ఆయన చెప్పారు.బిసిలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేసే యత్నం చేస్తున్నారని కృష్ణమూర్తి విమర్శించారు.