ఏపీ జీవనాడి ప్రాజెక్టు పోలవరం పై వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్లు చేశారు. నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో.
.మీడియాతో మాట్లాడిన ఆయన.పోలవరం ప్రాజెక్టు పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే గతంలో డిసెంబర్ ఫస్ట్ 2021కి కంప్లీట్ చేస్తామని కామెంట్లు చేసిన మాట వాస్తవమే.
కానీ గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల అదే రీతిలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ప్రాజెక్టు సకాలంలో కంప్లీట్ చేయలేకపోయామని.ఒప్పుకున్నారు.

గత ప్రభుత్వం స్పిల్ వే, కాఫర్ డ్యామ్ ఒకే సారి కట్టడం అవి సగం సగం మాత్రమే పూర్తయ్యాయని.నెల్లూరులో గూడూరు ప్రాంతంలో విలేకర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా డయాఫ్రం వాల్, దిగువన కాఫర్ డ్యాం దెబ్బతిన్నదని తెలిపారు.ఈ క్రమంలో వచ్చిన వరద నీటిని దారి మళ్ళించే ఈ విషయంలో కూడా డ్యాం డ్యామేజ్ అయ్యింది అని.కానీ తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును చిత్తశుద్ధితో పూర్తి చేయాలి అన్న తరహాలోనే పనిచేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.