అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు.ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచంతో పాటు సొంత ప్రజలకు సైతం ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
విదేశీయుల బహిష్కరణ, ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు, ఉక్రెయిన్ – రష్యా, హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధాలపై ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ సహా పలు నగరాల్లో ప్రజలు రోడ్డెక్కారు.
ది గార్డియన్( The Guardian ) నివేదించిన ప్రకారం.50 రాష్ట్రాలలో 50 నిరసనలు ఒకే ఉద్యమంగా ఐక్యంగా ఉండటం గమనార్హం.అమెరికా అంతటా దాదాపు 400కు పైగా ర్యాలీలు జరిగినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మాన్హట్టన్ నుంచి శాన్ఫ్రాన్సిస్కో( Manhattan to San Francisco ) వరకు ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకారులు ఆందోళనలు నిర్వహించారు.శాన్ఫ్రాన్సిస్కోలోని పసిఫిక్ మహాసముద్రం వైపుగా ఉన్న బీచ్ ఇసుకపై ట్రంప్ను అభిశంసించండి లేదా తొలగించండి అంటూ మానవ హారంగా నిలబడ్డారు.
ఈ ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నిరసనకారులు ఇప్పటికే మూడుసార్లు వీధుల్లోకి వచ్చారు.ఇది అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరిగిన నాల్గవ అతిపెద్ద నిరసనగా విశ్లేషకులు చెబుతున్నారు.
శనివారం వైట్హౌస్ ఎదుట నిరసనకారులు భారీగా ఆందోళనలకు దిగారు.కార్మికులకు అధికారం ఉండాలి.
రాచరికం లేదు, ఇజ్రాయెల్కు ఆయుధాలను పంపడం ఆపండి వంటి పోస్టర్లతో నిరసనకారులు ధర్నా నిర్వహించారు.ట్రంప్ యంత్రాంగం వలసదారులను బహిష్కరించిందని , స్వదేశాలకు పంపడానికి ప్రయత్నిస్తోందని నిరసనకారులు నినాదాలు చేశారు.
ట్రంప్ కార్యాలయం తొలగించిన ఫెడరల్ ఉద్యోగులకు వారు సంఘీభావం తెలిపారు.

పౌర హక్కులు, రాజ్యాంగ ఉల్లంఘలనకు వ్యతిరేకంగా తాము ప్రదర్శన చేస్తున్నామని నిరసనకారులు చెబుతున్నారు.ట్రంప్ అమెరికాలో పోలీస్ రాజ్యాన్ని సృష్టిస్తున్నారని తాను ఆందోళన చెందుతున్నానని ఓ నిరసనకారుడు వ్యాఖ్యానించాడు.ట్రంప్ ఫాసిస్ట్ పాలన పోవాలి అంటూ అతను ఓ ఫ్లకార్డ్ను పట్టుకుని నిరసనకు దిగాడు.