టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వాటిలో ప్రియదర్శి( Priyadarshi ) ఒకరు ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించి ప్రేక్షకు ఆదరణ సొంతం చేసుకున్నారు.అయితే ఇటీవల కాలంలో ఈయన హీరోగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇటీవల కోర్ట్ ( Court ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ప్రియదర్శి త్వరలోనే సారంగపాణి జాతకం ( Sarangapani Jathakam ) అనే సినిమా ద్వారా రాబోతున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రియదర్శి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు కెరియర్ పరంగా తాను ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నానని తెలిపారు.
తాను కమెడియన్ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదని ప్రకాష్ రాజు, తనికెళ్ల భరణి వంటి వారిని చూసి అలాంటి పాత్రలలో నటించాలని భావించి ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

ఇప్పటివరకు నాకు అలాంటి క్యారెక్టర్లు దొరకలేదని ఆ విషయంలో నాకు అసంతృప్తిగా ఉందని వెల్లడించారు.ఇక నా కెరియర్లో ఇప్పటివరకు నటించే సినిమాలలో కోర్టు సినిమా చాలా బెస్ట్ సినిమా అని తెలిపారు.మిఠాయి( Mithai ) సినిమా చేయడం నా కెరీర్ లోనే చెత్త నిర్ణయం.
ఇప్పుడిప్పుడే నాకు ఎలాంటి సినిమాలు చేయాలి అనే దానిపై క్లారిటీ వస్తోంది.ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.
ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒక ఎత్తు.సారంగపాణి జాతకం నాకు కొత్త తరహా సినిమా.
ఇప్పటివరకు తాను ఇలాంటి పాత్రలో నటించలేదని కచ్చితంగా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని ప్రియదర్శి వెల్లడించారు.