వీణా నగ్డా( Veena Nagda ) అనే ఆమె మెహందీ డిజైన్స్తో ఇండియాలో బాగా ఫేమస్ అయ్యింది.నాలుగు దశాబ్దాలుగా అంబానీ కుటుంబంతో ఆమె అనుబంధం ఉంది.
పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో వీణా నగ్డా మెహందీ లేకుండా జరగదు అంటే అతిశయోక్తి కాదు.కొన్ని నెలల క్రితం అనంత్-రాధిక( Anant-Radhika ) పెళ్లిలో కూడా నీతా అంబానీ, రాధికా మెర్చంట్లకు మెహందీ పెట్టింది వీణానే.
అయితే వీణకి అంబానీ కుటుంబంతో కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే కాదు.దాదాపు 40 ఏళ్ల క్రితం ముఖేష్ అంబానీ ( Mukesh Ambani )సిస్టర్ దీప్తి సల్గావ్కర్ పెళ్లిలో కూడా మెహందీ పెట్టిందంటే, వీళ్ల బంధం ఎంత స్ట్రాంగో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ విషయం ఏంటంటే, ముఖేష్ అంబానీ బర్త్డే సందర్భంగా వీణా నగ్డా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందులో ఆమె ముఖేష్ అంబానీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
బిజినెస్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ముఖేష్ అంబానీ పర్సనల్ రిలేషన్స్కి కూడా అంతే వాల్యూ ఇస్తారని వీణా నగ్డా అన్నారు.ఎంత బిజీగా ఉన్నా, ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే, వీణా నగ్డాని కలిసిన ప్రతిసారి.
ఆమె ఫ్యామిలీ గురించి తప్పకుండా అడుగుతారట.ఇదే ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్కి నిదర్శనం అని ఆమె తన పోస్ట్లో మెన్షన్ చేశారు.

“ముఖేష్ అంబానీ బిజినెస్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, పర్సనల్ బాండ్స్కి చాలా వాల్యూ ఇస్తారు.ఆయన్ని కలిసినప్పుడల్లా నా ఫ్యామిలీ గురించి అడగడం ఆయన మర్చిపోరు.ఇదే ఆయన సింప్లిసిటీకి నిదర్శనం” అని వీణా నగ్డా తన పోస్ట్లో రాసుకొచ్చారు.అంతేకాదు, అంబానీ ఫ్యామిలీతో దిగిన కొన్ని పాత ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు.
ముఖేష్ అంబానీ గురించి చెప్పాలంటే, 1957 ఏప్రిల్ 19న ఆయన పుట్టారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ప్రపంచానికి తెలుసు.ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ ఆయన తల్లిదండ్రులు.నీతా అంబానీ ఆయన భార్య.
ఈ దంపతులకు ఇషా, ఆకాష్ అనే కవల పిల్లలు, అనంత్ అనే ఒక కుమారుడు ఉన్నారు.నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ను లీడ్ చేస్తున్నారు.

ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ముఖేష్ అంబానీ నెట్ వర్త్ 96 బిలియన్ డాలర్లు.దీంతో ఆయన భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.ముఖేష్ అంబానీ వాళ్ళు బయటికి పేదవాళ్లను, ఇతరులను మంచిగా చూసుకుంటారని, కెమెరా ఆఫ్ లో ఉన్నప్పుడు చులకనగా చూస్తారనే విమర్శలకు వీణా వ్యాఖ్యలు గట్టి కౌంటర్ లాగా నిలుస్తున్నాయి.