బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి.బుల్లితెరపై ఫలానా షో వస్తుంది అంటే ప్రేక్షకులు కల్లా అర్పకుండా ఆ కార్యక్రమాన్ని చూస్తూ మంచి విజయాన్ని అందిస్తారు.
ఇలాంటి సక్సెస్ అయినటువంటి షోలలో పాడుతా తీయగా ( Padutha Theeyaga ) సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమం ఒకటి.ఒకప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఈ కార్యక్రమానికి జడ్జిగా ఉంటూ ఎంతోమంది సింగర్లను ప్రోత్సహిస్తూ వచ్చారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ఎంఎం కీరవాణి( M.M.Keeravani ) సునీత ( Sunitha ) చంద్రబోస్( Chandra Bose ) జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమంలో జరిగే చీకటి కోణాల గురించి సింగర్ ప్రవస్తి ఆరాధ్య( Singer Pravasti Aradhya ) సంచలన వీడియో రిలీజ్ చేశారు.ఈ వీడియోలో భాగంగా ఈమె జడ్జిల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాకు ఏదైనా జరిగితే అందుకు కారణం సునీత చంద్రబోస్ కీరవాణి అంటూ తెలియజేశారు.
ఈ ముగ్గురు నా పట్ల చాలా పక్షపాతంతో వ్యవహరించేవారు నా పాటలకు ఉద్దేశపూర్వకంగానే నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవారు.ఇక సింగర్ సునీతకు నేనంటే అసలు పడదని నేను పాట పాడుతుంటే ఆమె ఇష్టంగా అక్కడ కూర్చొని ఉండేదని తెలిపారు.

ప్రవస్తి స్టార్ మా లో సూపర్ సింగర్ 2024 విజేతగా నిలిచింది.పాడుతా తీయగా షో గతంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు అని ప్రవస్తి తెలిపారు.పాడుతా తీయగా షో సిల్వర్ జూబ్లీ సిరీస్ వల్ల మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యానని, ఈ షోలో జడ్జిలు ముగ్గురు నన్ను ఒక చీడ పురుగును చూసినట్టు చూసేవారని తెలిపారు.ఇక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి కూడా ప్రవస్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాళ్ళు మాకు కాస్ట్యుమ్స్ ఇచ్చి నడుము కిందికి శారీ కట్టుకోండి, ఎక్స్ ఫోజింగ్ చేయండి అని చెబుతారు.కాస్ట్యూమ్ డిజైనర్ అయితే.నీకున్న బాడీకి ఇంకేమి ఇవ్వగలను అంటూ అసభ్యంగా మాట్లాడాడు.ఇలా మాట్లాడటం వల్ల మాకు ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది అంటూ పాడుతా తీయగా షోలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఈమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.