ధనుష్,( Dhanush ) నాగార్జున( Nagarjuna ) కాంబినేషన్ లో తెరకెక్కిన కుబేర సినిమాపై( Kubera ) ఒకింత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.డైరెక్టర్ శేఖర్ కమ్ముల( Director Sekhar Kammula ) ఈ సినిమా కోసం ఏకంగా 130 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.
ఈ సినిమాకు ధనుష్ పారితోషికం 30 కోట్ల రూపాయలు కాగా నాగార్జున పారితోషికం 14 కోట్ల రూపాయలు అని భోగట్టా.
టాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పని చేస్తుండటంతో ఈ సినిమాకు ఈ స్థాయిలో ఖర్చు అయిందని తెలుస్తోంది.
ఓటీటీ, హిందీ హక్కులతో ఇప్పటికే ఈ సినిమాకు 90 కోట్ల రూపాయలు వచ్చాయని తెలుస్తోంది.ఇతర ఏరియాల హక్కులతో కలిపి ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
కుబేర బాక్సాఫీస్ ను షేక్ చేయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

శేఖర్ కమ్ముల సినిమాలలో కథనం కొత్తగా ఉంటుందనే సంగతి తెలిసిందే.తెలుగు, తమిళ భాషల్లో కుబేర ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.శేఖర్ కమ్ముల స్థాయిని ఈ సినిమా మరింత పెంచడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఆనంద్ సినిమాతో శేఖర్ కమ్ముల సినీ ప్రయాణం మొదలు కాగా ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

శేఖర్ కమ్ముల నిదానంగా సినిమాలు తీసినా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలను తెరకెక్కించడం ప్లస్ అయిందని చెప్పవచ్చు.కుబేర సినిమా ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.శేఖర్ కమ్ముల భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది.
కుబేర సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.