కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోడిలో( Chikkodi, Belagavi district, Karnataka ) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కొందరు పరీక్షల్లో పాస్ చేసేయమని టీచర్లకు లంచం ఇవ్వబోయారు.
ఏకంగా ఆన్సర్ షీట్లలోనే డబ్బులు పెట్టి, ఎమోషనల్ మెసేజ్లు రాసి టీచర్లను బతిమాలారు.ఎన్డిటివి రిపోర్ట్ చేసిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పరీక్ష పేపర్లు దిద్దే టీచర్లు ఆన్సర్ షీట్లలో డబ్బు నోట్లు, ఎమోషనల్ మెసేజ్లు చూసి షాక్ అయ్యారు.చాలా వరకు 500 రూపాయల నోట్లు ఉన్నాయి.
కొన్ని మెసేజ్లలో తమను దయతో పాస్ చేయమని వేడుకున్నారు.ఎలాగైనా పాస్ అయిపోవాలని తెగ ఆరాటపడ్డారు స్టూడెంట్స్.
టీచర్లను ఇంప్రెస్ చేయడానికి ఎమోషనల్ టచ్ ఇచ్చారు.ఫన్నీగా కూడా అప్పీల్ చేశారు.

ఒక విద్యార్థి ఏకంగా 500 రూపాయల నోటు పెట్టి, ‘సార్ ఈ 500 రూపాయలతో టీ తాగండి.దయచేసి పాస్ చేయండి సార్’ అని రాశాడు.మరో విద్యార్థి ఇంకాస్త ఎమోషనల్గా ‘ప్లీజ్ పాస్ చేయండి, నా లవ్ మీ చేతుల్లోనే ఉంది’ అంటూ వేడుకున్నాడు.
ఇంకా ఫన్నీగా ఒక విద్యార్థి అయితే ‘నేను పాస్ అయితేనే నా లవ్ కంటిన్యూ చేస్తా’ అంటూ బెదిరించాడు.కొన్ని మెసేజ్లు మాత్రం చాలా సీరియస్గా ఉన్నాయి.
ఒక స్టూడెంట్ ‘నన్ను పాస్ చేయకపోతే మా పేరెంట్స్ నన్ను కాలేజ్కు పంపరు సార్’ అని తన భయాన్ని వెళ్లగక్కాడు.మరో విద్యార్థి ఏకంగా లంచం ఆఫర్ చేస్తూ ‘మీరు నన్ను పాస్ చేస్తే మీకు డబ్బులు ఇస్తా’ అని రాసుకొచ్చాడు.

ఈ మెసేజ్లు చూస్తుంటే విద్యార్థులు( students ) పరీక్షల విషయంలో ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అర్థమవుతోంది.చాలా మంది ఫెయిల్ అయితే తమ భవిష్యత్తు నాశనం అవుతుందని, ప్రేమ జీవితం ఆగిపోతుందని, కుటుంబం పరువు పోతుందని భయపడుతున్నారు.కొన్ని మెసేజ్లు ఫన్నీగా ఉన్నా చాలా వరకు ఆందోళన, భయం, ఒత్తిడితోనే రాశారు.
విద్యార్థుల నిర్వాకం చూసి టీచర్లు షాక్ అయ్యారు.ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు.
ఇది ఎంత మంది విద్యార్థులు చేస్తున్నారో తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేస్తున్నారు.ఈ ఘటన విద్యార్థులు బోర్డు పరీక్షల సమయంలో ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో, నైతిక విలువల గురించి ఎంత తక్కువ అవగాహన కలిగి ఉన్నారో చూపిస్తోంది.
విద్యార్థులకు మంచి ఎమోషనల్ సపోర్ట్, పరీక్షల ప్రిపరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.అప్పుడే ఇలాంటి పనులు చేయడానికి వాళ్లు వెనుకాడతారు.