టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి(Rajsmouli) సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మూడో షెడ్యూల్ చిత్రీకరణ కూడా ప్రారంభం కాబోతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న మహేష్ బాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే తాజాగా తన తల్లి ఇందిరా దేవి(Indira Devi) ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి రెండేళ్ల క్రితం సెప్టెంబర్ 2022 లో మరణించిన సంగతి తెలిసిందే.అయితే ఇవాళ ఇందిరా దేవి పుట్టిన రోజు(Birthday) కావడంతో మహేష్ బాబు కథ తల్లిని గుర్తు చేసుకున్నారు.అదేవిధంగా తన తల్లితో దిగిన ఫోటో షేర్ చేస్తూ.హ్యాపీ బర్త్ డే అమ్మ.మాటల్లో చెప్పలేనంత మిస్ అవుతున్నాను అని ఎమోషనల్ అయ్యారు.దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది.
ఇక ఈ పోస్ట్ చూసిన మహేష్ బాబు అభిమానులు ఇందిరా దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మహేష్ బాబును ఓదారుస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు తల్లి ఇందిరాదేవితో పాటు ఏడాదిలోపే తన తండ్రి కృష్ణ కూడా మరణించిన సంగతి తెలిసిందే.అదే ఏడాది తన అన్నయ్య రమేష్ బాబు కూడా మరణించారు.ఇలా ఏడాది వ్యవధిలోనే మహేష్ బాబు తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయారు.
ఇక మహేష్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.గుంటూరు కారం సినిమా ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ప్రస్తుతం ఎస్ఎస్ ఎంబి 29 పనులలో బిజీగా ఉన్నారు.
ఇక ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా ప్రియాంక చోప్రా నటించబోతున్నారు.