అమెరికాలో రాహుల్ గాంధీ .. ఎన్ఆర్ఐలతో సమావేశం కానున్న కాంగ్రెస్ అగ్రనేత

రెండు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో( Brown University ) ప్రసంగించనున్నారు.అలాగే ఎన్ఆర్ఐలు( NRI’s ) ఇతర కమ్యూనిటీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

 Congress Mp Rahul Gandhi Make Sensational Comments On Election Commission In Ame-TeluguStop.com

ఏప్రిల్ 23న వాషింగ్టన్‌లో భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలకు ముందు గాంధీ పర్యటన జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడా( Sam Pitroda ) ఆహ్వానం మేరకు రాహుల్ అమెరికాలో అడుగుపెట్టారు.

రాహుల్ గాంధీ అమెరికా( America ) పర్యటనపై శ్యామ్ పిట్రోడా ఓ పోస్ట్ పెట్టారు.వినూత్నమైన, సమ్మిళి భారతదేశాన్ని నిర్మించడంలో ప్రైవేట్ రంగం ప్రధాన పాత్ర పోషించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల వ్యవస్థపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల వ్యవస్ధ రాజీపడిందని, అందులో లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు.ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో చోటు చేసుకున్న ఓటింగ్‌పై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఓటు ఎలా వేస్తారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

Telugu America, Brown, Congressmp, India, Rahul Gandhi, Rahulgandhi, Rhode Islan

బ్రౌన్ యూనివర్సిటీ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ.అధ్యాపకులు, విద్యార్ధులతో సంభాషిస్తారు.అలాగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతోనూ ఆయన భేటీ కానున్నారు.అంతకుముందు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా ఎక్స్‌లో రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వివరాలు తెలియజేశారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏప్రిల్ 21 , 22 తేదీలలో అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీని సందర్శిస్తారని పేర్కొన్నారు.

Telugu America, Brown, Congressmp, India, Rahul Gandhi, Rahulgandhi, Rhode Islan

ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది రెండవసారి.సెప్టెంబర్ 2024లో రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించారు.అక్కడ డల్లాస్‌‌లోని టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్ధులు, అధ్యాపకులతో సంభాషించారు.

అలాగే ప్రవాస భారతీయులతోనూ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రిజర్వేషన్లు, భారత్‌లో మతస్వేచ్ఛ వంటి అంశాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

పరాయి దేశంలో ఉండి భారతదేశ పరువు తీస్తున్నారంటూ అధికార బీజేపీ మండిపడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube