బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ( Disha Patani ) సోదరి ఖుష్బూ( Khushboo ) ఆర్మీలో మేజర్ గా ( Army Major ) సేవలందించిన విషయం మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.దాదాపుగా 12 ఏళ్ల పాటు దేశానికి సేవ చేసిన ఆమె రెండేళ్ల క్రితం స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నారు.
అయితే ప్రస్తుతం ఆమె ఫిట్నెస్ కోచ్ గా పని చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అందులో భాగంగానే తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో జనాల హృదయాలను కదిలిస్తోంది.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఉత్తరప్రదేశ్ బరేలీలో( Bareilly ) నివసిస్తున్న ఖుష్బూ ఆదివారం ఉదయం అలా బయటకు నడుచుకుంటూ వెళ్లారు.పాడుబడ్డ ఇంట్లో ఏవో శబ్దాలు వినిపించడంతో లోనికి వెళ్లి చూడగా అక్కడ ఒక చిన్నారి( Baby ) కనిపించిందట.
నేలపై ఒళ్లంతా మట్టితో ఉన్న ఆ చిన్నారిని చూడగానే ఖుష్బూ మనసు తరుక్కుపోయిందట.పసిపాపను ఇలా అనాథను చేసి వదిలేశారేంటని ఆమె బాధపడ్డారట.తరవాత ఆ పాపాయిని జాగ్రత్తగా తన ఒడిలోకి తీసుకొని, చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుంటే ఆమెను లాలించి చివర్లో పాప ముఖాన్ని దగ్గరి నుంచి చూపిస్తూ ఈ చిన్నారి గురించి తెలిసినవారు తనను సంప్రదించమని కోరారు.
ఈ పసిపాపను పాడుబడ్డ ఇంట్లో వదిలేసిన తల్లిదండ్రులపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మీరేం తల్లిదండ్రులు? పాప భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసినందుకు సిగ్గుపడండి అంటూ ఆమె మండిపడ్డారు.దేవుడే రక్షణగా నిలబడే వ్యక్తికి ఎవరూ హాని తలపెట్టలేరు.
ఈ చిన్నారిని అధికారులకు అప్పగించాము.తను మంచి చేతుల్లోకి వెళ్లేలా చూసుకుంటాను.
కచ్చితంగా తన భవిష్యత్తు బాగుంటుంది.మన దేశంలో ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతాయి? దయచేసి ఆడపిల్లల్ని కాపాడండి అని ఖుష్బూ కోరారు.ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.