మధ్యప్రదేశ్లోని( Madhya Pradesh ) ఓ ప్రభుత్వ స్కూల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ టీచర్ విద్యార్థులకు మద్యం తాగడం నేర్పుతూ వీడియోలో కనిపించడంతో సస్పెండ్ అయ్యారు.
ఈ ఘటన కట్నీ జిల్లాలోని బర్వారా బ్లాక్ ( Barwara Block )పరిధిలోని ఖిర్హాని గ్రామంలో జరిగింది.
లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ ( Lal Naveen Pratap Singh )అనే టీచర్ ఆ ఊర్లోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నారు.
ఆయన పిల్లలతో కింద కూర్చొని ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో టీచర్ స్వయంగా గ్లాసుల్లో మందు పోసి పిల్లలకు ఇస్తున్నారు.
అంతేకాదు, “నీళ్లు కలుపుకొని తాగండి” అని కూడా చెబుతున్నారు.షాకింగ్ ఏంటంటే, పిల్లలు కూడా ఆయన చెప్పినట్టే నీళ్లు కలుపుకొని మందు తాగుతుంటే టీచర్ చూస్తూ ఊరుకున్నారు.
ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.నెటిజన్లు టీచర్ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు.బాధ్యత లేకుండా, ప్రమాదకరంగా ప్రవర్తించారని తిట్టిపోస్తున్నారు.ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో కట్నీ జిల్లా కలెక్టర్ దిలీప్ కుమార్ యాదవ్ ( Dilip Kumar Yadav )వెంటనే స్పందించారు.
జిల్లా విద్యాశాఖాధికారి ఓపీ సింగ్కు వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీంతో లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నిబంధనల కింద ఈ సస్పెన్షన్ వేటు వేశారు.టీచర్ తీవ్రమైన తప్పు చేశారని, పిల్లలకు మద్యం అలవాటు చేస్తూ టీచర్ వృత్తికే మచ్చ తెచ్చారని అధికారులు తెలిపారు.
పూర్తి విచారణ జరుపుతామని అధికారులు స్పష్టం చేశారు.ఇలాంటి ఘటన ఎలా జరిగిందో తెలుసుకొని, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ షాకింగ్ ఘటన మరోసారి స్కూళ్లలో పిల్లల భద్రత, వారికిచ్చే గైడెన్స్ గురించి ప్రశ్నలు రేకెత్తిస్తోంది.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి జరగడం ఆందోళన కలిగిస్తోంది.
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు కఠిన శిక్షలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.