కర్ణాటక రాష్ట్రంలోని మాజీ డీజీపీ ఓం ప్రకాశ్( Ex-DGP Om Prakash ) హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.భర్తను భార్య హత్య చేసిన ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది.
తాజాగా పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం ఈ హత్య పాత గొడవల నేపథ్యంలో జరిగినట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా.
ఆదివారం మధ్యాహ్నం ఓం ప్రకాశ్, ఆయన భార్య పల్లవి( Pallavi ) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఆ గొడవ ఎక్కువ కావడంతో పల్లవి ఊహించని విధంగా ప్రవర్తించింది.
మద్యం మత్తులో ఉన్న ఓం ప్రకాశ్ను కారం పొడి చల్లడంతో పాటు చేతులు కట్టేసి, గ్లాస్ బాటిల్తో పొడిచి హత్య చేసింది.ఈ సంఘటన అనంతరం పల్లవి మరో పోలీసు అధికారి భార్యకు ఫోన్ చేసి తన భర్తను తానే చంపినట్లు తెలిపింది.
వెంటనే సమాచారం పోలీసులకు అందగా, వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఓం ప్రకాశ్ తన బంధువుకు ఒక ఆస్తిని( Property ) బదిలీ చేసిన విషయమై భార్యతో గొడవ జరిగినట్లు సమాచారం.ఆ ఆస్తి బదిలీ అంశమే ఈ ఘోరానికి మూలమని అతని బంధువులు చెబుతున్నారు.మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పల్లవి ఆరోగ్య పరిస్థితిపై కూడా విచారణ చేస్తున్నారు.

అయితే, పల్లవి గత 12 ఏళ్లుగా స్కిజోఫీనియాతో బాధపడుతోందని, చికిత్స పొందుతోందని ఆమె కుమారుడు పోలీసులకు తెలిపాడు.భర్త నుంచి తనకు ప్రమాదం ఉందని తరచూ భయపడేదని, ఊహాజనిత ఆలోచనలతో బాధపడుతూ ఆందోళనకు గురయ్యేదని వివరించాడు.ఇది ఆమె ఆచరణపై ప్రభావం చూపిందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
ఇక ఓం ప్రకాశ్ జీవిత విషయానికి వస్తే.1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ బిహార్ రాష్ట్రం చంపారన్కు చెందినవారు.ఆయన 2015లో కర్ణాటక డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు.అప్పటి నుంచి బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు.ఆదివారం మధ్యాహ్నం పల్లవి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంటికి వెళ్లిన పోలీసులు, ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు.వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ హత్య కేసు నేపథ్యం, మానసిక అనారోగ్యం, ఆస్తి వివాదం వంటి కోణాలతో సుదీర్ఘ దర్యాప్తు జరగనున్నట్లు సమాచారం
.