తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 నుండి జెస్సీ హఠాత్తుగా బయటకు వెళ్లి పోవాల్సి వచ్చింది.గత కొన్ని రోజులుగా అతడు అనారోగ్యంతో బాధ పడుతున్నాడు.
కళ్లు సరిగా కనిపించక పోవడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాడు.అందుకే బిగ్ బాస్ టీమ్ అతడిని బయటకు మెరుగైన చికిత్స కోసం పంపించాలనే నిర్ణయానికి వచ్చింది.
బిగ్ బాస్ హౌస్ నుండి కేవలం ప్రేక్షకుల ఓట్ల తో మాత్రమే బయటకు వెళ్తారు.కాని చాలా అరుదుగా మాత్రం ఇలాంటి అనారోగ్య సమస్యలతో కూడా బయటకు వెళ్లాల్సి వస్తుంది.
గత సీజన్ ల్లో గంగవ్వ మరియు నోయల్ లు అనారోగ్య సమస్యలతో బయటకు వెళ్లాల్సి వచ్చింది.మళ్లీ ఇప్పుడు ఈ సీజన్ లో జెస్సీ బయటకు వెళ్లాల్సి వచ్చింది.
అయితే వారు ఇద్దరు రాలేదు.కాని జెస్సీ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జెస్సీ వెళ్లి పోయిన సమయంలో సిరి మరియు షన్నూలు చాలా ఏడ్చారు.వీరికి త్రిమూర్తులుగా పేరు ఉంది.
ముగ్గురు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు.
అనారోగ్యం మరీ ఇబ్బంది కరంగా అయితే లేదు అంటూ డాక్టర్లు ముందుగానే జెస్సీకి చెప్పారు.
అలా చెప్పిన నెక్ట్ జెస్సీని బయటకు పంపిస్తున్నట్లుగా చెప్పడం కాస్త విడ్డూరంగా ఉందంటూ ఉన్నారు.జెస్సీని ఆసుపత్రిలో చూపించి మళ్లీ అతడిని సీక్రెట్ రూమ్ కు తరలిస్తారు.
అక్కడ అతడికి మరింత వైధ్యం అందిన తర్వాత వారం రోజులకు బిగ్ బాస్ స్టేజ్ పైకి కాకుండా బిగ్ బాస్ ఇంట్లోకి నాగార్జున పంపించే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఈ వారంలో నామినేషన్స్ లో అంతా కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటం వల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బిగ్ బాస్ నుండి ఈవారం ఎలిమినేషన్ ఉండక పోవచ్చు అంటున్నారు.బిగ్ బాస్ లో చాలా వారాలుగా ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఈ వారం ఎలిమినేట్ అవ్వడం లేదు అంటూ క్లారిటీగా కొందరు నమ్మకంగా చెబుతున్నారు.ఏం జరుగుతుందో తెలియాలంటే శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే.