టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్ రాజమౌళి సినిమా మేకింగ్లో ఎక్స్పర్ట్గా ఉన్న సంగతి అందరికీ విదితమే.
అపజయం ఎరుగని వీరుడిగా రాజమౌళి సత్తా చాటుతున్నారు.‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.
తెలుగు సినిమా స్థాయిని అమాంతంగా పెంచేశారు.టాలీవుడ్లో స్టార్ హీరోల క్రేజీ కాంబినేషన్ ఆయనతోనే సాధ్యమయిందని చెప్పొచ్చు.
సాధారణంగా వేరే ఏ ఇతర డైరెక్టర్ అయినా రామ్ చరణ్ కాని జూనియర్ ఎన్టీఆర్ కాని మల్టీస్టారర్ మూవీ చేయడానికి ఓకే చెప్పేవారు కాదేమో.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’.
వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా చకచకా జరిగిపోతున్నాయి.
ఈ క్రమంలోనే సినిమా నుంచి తాజాగా ‘నాటు నాటు’ ఫుల్ సాంగ్ విడుదలైంది.కాగా, ఈ సాంగ్పై ప్రజల్లో అంతగా ఆసక్తి కనబడటం లేదు.
రాజమౌళి సినిమా అయితే ఏంటి అనే భావన అభిమానుల్లో ఎక్కువయిందని తెలుస్తోంది.ఎందుకంటే రాజమౌళి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడట.
సినిమా విడుదల తేదీని మారుస్తూనే ఉన్నాడు.
ఇకపోతే రోజురోజుకూ ఇలా రాజమౌళిపై నమ్మకం సన్నగిల్లితే అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది. రూ.500 కోట్లతో నిర్మితమైన సినిమా ఇలా అయితే ఇక అంతే సంగతులు.అయితే, ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ నుంచి హీరోలపై వచ్చిన టీజర్స్ అంచనాలను అందుకున్నాయి.కానీ, పాటలే అనుకున్న స్థాయిలో లేవని టాక్ వినబడుతోంది.‘నాటు…నాటు…వీరనాటు.ఊరనాటు’ సాంగ్కు టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ అయిన తారక్, చెర్రీ పవర్ ఫుల్ స్టెప్స్ వేశారు.
కానీ, ఈ సాంగ్కు ఎందుకో అనుకున్న స్థాయిలో గుర్తు రాలేదని కొందరు అంటున్నారు.
అయితే, ఈ సాంగ్ చూసి మెగా, నందమూరి అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.హీరోలిద్దరికీ సినిమాలో సమాన ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.ఈ చిత్రంలో తారక్ సరసన ఒలివియా నటిస్తుండగా, రామ్ చరణ్కు జోడీగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ నటించింది.
ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కనిపించనున్నారు.