ఆడవారి మాదిరిగానే మగవారు కూడా తమ చర్మం అందంగా, కాంతివంతంగా మెరవాలని ఆశ పడుతుంటారు.కానీ.
మద్యపానం, ధూమపానం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, లేట్ నైట్స్, పోషకాల లోపం, ఎండల్లో బాగా తిరగడం, ఒత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల చర్మం నిగారింపును కోల్పోతుంది.అయితే మగవాళ్ల కోసం మార్కెట్ లో అనేక క్రీములు అందుబాటులో ఉన్నాయి.
కానీ, వాటిలో అనేక రసాయనాలు కలగలిసి ఉంటాయి.వాటిని వాడటం కంటే ఇంట్లోనే పురుషులు కూడా చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా స్త్రీలతో పోలిస్తే మగవారి చర్మం చాలా కఠినంగా ఉంటుంది.
అయితే కఠినమైన చర్మాన్ని సున్నితంగా మార్చడంలో బాదం ఆయిల్ గ్రేట్గా సమాయపడుతుంది.రాత్రి నిద్రించే ముందు బాదం ఆయిల్ను ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకుని కాసేపు మార్దనా చేసుకోవాలి.
ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో బాత్ చేయాలి.ఇలా రెగ్యులర్గా చేస్తే చర్మం సాఫ్ట్ అండ్ స్మూత్గా మారుతుంది.
మరియు చర్మ ఛాయ కూడా పెరుగుతుంది.
అలాగే మొటిమలు ఇబ్బంది పెడుతుంటే.
ఒక స్పూన్ గంధం పొడిలో చిటికెడు కస్తూరి పసుపు మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మొటిమలపైనే కాకుండా ముఖం మొత్తానికి పూసి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే మొటిమలు లేకుండా ఏవైనా నల్ల మచ్చలు ఉన్నా పోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ బ్రౌన్ షుగర్, రెండు స్పూన్ల టమాటా రసం, ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి స్క్రబ్బింగ్ చేసుకుని చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.అపై మాయిశ్చరైజర్ రాసుకోవాలి.ఇలా వారంలో ఒక సారి చేస్తే దుమ్ము ధూళి, మృత కణాలు పోయి స్కిన్ గ్లోగా మెరుస్తుంది.
ఇక ఈ టిప్స్తో పాటు ప్రతి రోజు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.కంటి నిండా నిద్ర పోవాలి.మద్యపానం, ధూమపానం అలవాట్లను మానుకోవాలి.
పోషకాహరం తీసుకోవాలి.మరియు రెగ్యులర్గా వ్యాయామాలు చేయాలి.
తద్వారా మీ ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది.