బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే.ఈమె గత కొన్ని సంవత్సరాల నుంచి అతనితో డేటింగ్ చేస్తూ అతనితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది.
ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం కత్రినాకైఫ్ అత్యంత సన్నిహితుడైన ఏక్ థా టైగర్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇంట్లో వీరిద్దరికి రోకా జరిగిందనే విషయం చక్కర్లు కొడుతున్నప్పటికీ వీరు మాత్రం ఏ విధంగానూ స్పందించలేదు.ఈ క్రమంలోనే ఈమె అభిమానులు ఈ వార్త కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ వివాహం తర్వాత జుహులోని రాజ్మహల్ అల్ట్రా లగ్జరీ భవనంలో ఓ ఫ్లాట్ను ఐదేళ్లకు రెండు తీసుకున్నారని వివాహం తర్వాత ఈ జంట ఈ అపార్ట్మెంట్లో కి మారనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ముంబైలో ఒక మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదే బిల్డింగ్ లోనే స్టార్ కపుల్స్ అయినటువంటి అనుష్క విరాట్ కోహ్లీ కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే కత్రినాకైఫ్ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా.
గతంలో కత్రినాకైఫ్ చాలామంది సెలబ్రిటీలతో రిలేషన్ లో ఉన్నారు.కెరియర్ మొదట్లోనే సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడిన కత్రినాకైఫ్ అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది అయితే ఈ విషయాన్ని ఎక్కడా బయట పెట్టలేదు.సల్మాన్ ఖాన్ తర్వాత రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న ఈమె పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై కత్రినాకైఫ్ స్పందించలేదు.ఇక మాల్యా తనయుడితో కూడా ప్రేమలో ఉందని వార్తలు వచ్చినప్పటికీ ఏ ఒక్క ప్రేమ విషయం గురించి అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.
ఇక తాజాగా ఈమె నటుడు విక్కీ కౌశల్ ప్రేమలో ఉన్నట్లు వీరు పెళ్లి కూడా చేసుకున్నారు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే తప్పనిసరిగా ఈ విషయంపై కత్రినాకైఫ్ స్పందించాల్సి ఉంటుంది.