రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం ముందస్తుగా ఉగాది సంబరాలు పాఠశాల కరస్పాండెంట్ కొడగంటి గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా కొడగంటి గంగాధర్ మాట్లాడుతూ.
హిందువుల అతిపెద్ద పండుగైన తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది.జీవితంలో కష్టాల, సుఖాలు మరియు బాధలు ఉంటాయి.
అయితే ఈ ఉగాది మీ జీవితంలో సుఖ సంతోషాలు మరియు చదువు, ఆరోగ్యం, ఆయుష్యు అందివ్వడానికి ఉగాది పండుగ జరుపుకుంటారు.మన పాఠశాలలో ముందస్తుగా ఉగాది వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు .విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
.