మృతుడి కుటుంబానికి గ్రామస్తుల చేయూత

రాజాన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన బంటు ఆనందం గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు.మృతుడిది నిరుపేద కుటుంబం, ఇద్దరు చిన్నపిల్లలు ఉండడంతో చలించిపోయిన గ్రామస్తులు 18500 రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం ఆ కుటుంబానికి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.ఆపదలో ఉన్నవారికి అనునిత్యం అండగా నిలిచే వివేకానంద సేవా సమితి సభ్యులు రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

 Villagers Support The Family Of The Deceased, Villagers ,family Of The Deceased,-TeluguStop.com

ఎన్నారైల చేయూత

ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లిన పొలాస అంజయ్య,పొలాస శంకర్ లు బంటు ఆనందం మృతి గురించి తెలుసుకొని 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వారికి దాతలు సహకారం అందజేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో మందాల అబ్రహం, గొర్రె నందు, మాదం బాబు, పాటి సుధాకర్, లోకోజు సతీష్, కొడగంటి గంగాధర్ , పొలాస సంతోష్, మాదాడి కరుణాకర్ రావు, గొంటి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube