రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహకారంతో చెక్కులు మంజూరు కావడం జరిగింది.వల్లంపట్ల గ్రామానికి చెందిన పెంటల అఖిల :14,500/-, పెంటల మల్లయ్య :14,000/-,జంగిటి మమత : 18,000/-, కొండికోప్పుల మహేందర్ :9000/-,చింతల సౌజన్య :24,000/-,రూపాయల చెక్కులను లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకట నర్సింహా రెడ్డి, ఎంపీటీసీ నాయిని స్రవంతి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో చెక్కులను అందించారు.ఈ సందర్బంగా లబ్ధిదారులు అందరూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సర్పంచ్, ఎంపీటీసీ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐరెడ్డి మల్లారెడ్డి, పండుగ భాస్కర్, జంగిటి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News