తెలుగు రాష్ట్రాలలో కమెడియన్ బ్రహ్మానందం( Comedian Brahmanandam ) పేరు తెలియని వారు ఎవరు ఉండరు.దాదాపు కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను తన కామెడీతో నవ్విస్తున్నారు.
అత్యధిక సినిమాలు చేసిన సినిమా నటుడిగా గిన్నిస్ బుక్ రికార్డు కూడా క్రియేట్ చేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోలుగా ఉన్న అందరితో బ్రహ్మానందం నటించడం జరిగింది.
అయితే కరోనా తర్వాత బ్రహ్మానందం సినిమాలు ఒప్పుకోవటంలో కాస్త నెమ్మదించారు.మళ్లీ ఇప్పుడు బ్రహ్మానందం సినిమాలు చేస్తూ వస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన “బ్రో”( Bro ) సినిమాలో కీలక పాత్ర పోషించారు.ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని బ్రహ్మానందం కలవడం జరిగింది.
కొడుకు గౌతమ్( Brahmanandam Son Gowtham ) వివాహానికి తప్పకుండా హాజరు కావాలని ప్రగతి భవన్ లో సీఎం దంపతులకు( CM KCR Couple ) బ్రహ్మానందం శుభలేఖ అందజేశారు.ఈ సందర్భంగా తాను గీసిన వెంకటేశ్వరుడి చిత్రపటాన్ని కేసీఆర్ కి అందించారు.
ఈ క్రమంలో బ్రహ్మానందం వెంట కొడుకు గౌతమ్ కూడా ఉన్నారు.బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థకి పెళ్లి ఖరారు అయింది.
మే 21న ఐశ్వర్య అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది.ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
అయితే త్వరలో హైదరాబాద్ లో జరగనున్న వివాహ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( Telangana CM KCR ) ని బ్రహ్మానందం ఆహ్వానించడం జరిగింది.