బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడు పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు.అదేవిధంగా సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోంది.
రామాయణం అనగానే లక్ష్మణుడి పాత్ర ఎంతో కీలకమైనది కనుక ఇందులో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు.దాదాపు ఈ చిత్రంలో రావణాసురుడు, లక్ష్మణుడి పాత్రలకు సంబంధించిన షూటింగ్ ను ముందే పూర్తి చేసుకున్నారు.
రామాయణంలో రాముడు లక్ష్మణుడు మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమాలో కూడా వీరి పాత్రను అంతే అద్భుతంగా చిత్రీకరించడమే కాకుండా నిజజీవితంలో కూడా ప్రభాస్ నటుడు సన్నీ సింగ్ మధ్య అంత అనుబంధం ఉంది.
ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడటంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ఈ క్రమంలోనే తన పోస్ట్ ను మొదట ప్రభాస్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి పెట్టారు.
అయితే ప్రభాస్ కి కేవలం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉందని, ట్విట్టర్ అకౌంట్ లేదనే విషయం సన్నీ సింగ్ కు తెలియదు.
ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ ని తిరిగి ట్విట్టర్ అకౌంట్ కి పోస్ట్ చేయడంతో అది ఒక ప్రభాస్ అభిమాని ట్విట్టర్ హ్యాండిల్స్ కి వెళ్లడంతో ప్రభాస్ అభిమానులు కొంతమేర హర్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు స్పందిస్తూ ప్రభాస్ ట్విట్టర్ అకౌంట్ లేదు దయచేసి ఈ పోస్ట్ డిలీట్ చేయండి అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం లక్ష్మణుడి వై ఉండి ప్రభాస్ కి ట్విట్టర్ ఎకౌంట్ లేదనే విషయం కూడా తెలియదా అంటూ అతనినీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇంతకీ సన్నీ సింగ్ చేసిన పోస్టులు ఏముంది అనే విషయానికి వస్తే.
జీవితం ముందుకు వెళ్తున్న మన దారులు వేరవుతాయోమో కానీ మన బంధం మాత్రం వేరు కాదు.నీతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది సోదరా అంటూ లక్ష్మణుడు సన్నీ సింగ్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.