వంద సంవత్సరాల క్రితం మాయం అయినా విగ్రహం ఇప్పటికి ఇండియా కు చేరింది.18 దశాబ్దానికి చెంసిన ఈ విగ్రహం వందేళ్ల క్రితం చోరీ చేయబడింది.ఇండియాలో మాయమైన ఈ విగ్రహం కెనడా లో గుర్తించారు.కేద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆ విగ్రహాన్ని ఇన్ని ఎళ్ల తర్వాత ఇండియా కు తీసుకు వచ్చేలా చర్యలు తీసుకుంది.
అసలు ఈ విగ్రహం గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.
ఇది 18 శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ దేవి విగ్రహం.
ఈ విగ్రహాన్ని వందేళ్ల క్రితం చోరీ చేసారు.ఇక ఈ చోరీ అయినా విగ్రహం వంద ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చేలా చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించారు.దీంతో అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆ అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని తిరిగి ఇండియా కు తీసుకు వచ్చింది.
ఈ విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు.ఇక ఈ విగ్రనికి మాత అన్నపూర్ణ దేవి యాత్ర పేరుతో 4 రోజులపాటు శోభాయాత్ర నిర్వహించి ఈ నెల 15న కాశీ విశ్వేశ్వర ఆలయంలో యూపీ సీఎం యోగి చేతుల మీదుగా అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయనున్నారు.ఇక ఈ విగ్రహాన్ని అప్పగించడం గురించి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వందేళ్ల క్రితం దొంగిలించబడిన విగ్రహాన్ని తిరిగి యూపీ ప్రభుత్వానికి అప్పగించడం సంతోషంగా ఉందని.ఈ విగ్రహాన్ని ఇండియాకు రప్పించడం కోసం కొన్ని సంవత్సరాలుగా సంప్రదింపులు జరుపుతున్నామని ఇన్నాళ్లకు ఈ విగ్రహాన్ని ఇండియాకు తిరిగి తీసుకు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.ఇక భారత సంస్కృతికి చెందిన విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయని త్వరలోనే వాటన్నిటిని వెనక్కి తీసుకు వస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.