తుఫాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సూర్యాపేట జిల్లా:మిగ్ జామ్ తుఫాను ప్రభావం వల్ల సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు,రైతులు, వాహనదారులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ( Rahul Hegde ) సూచించారు.మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు.

 People Should Be Alert In View Of The Cyclone Michaung , Sp Rahul Hegde ,surya-TeluguStop.com

మిగ్ జామ్( Cyclone Michaung ) దృష్ట్యా సూర్యాపేట జిల్లా పోలీసు అధికారులను,సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు.అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి సేవలు అందించాలని సిబ్బందిని అదేశించారు.

ఏదైనా అత్యవసరమైతే స్థానిక పోలీసులకు,డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు సేవలను పొందవచ్చని తెలిపారు.అధిక వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు శిథిలావస్థకు వచ్చిన నివాసలలో ఉండవద్దని,చేపల వేటకు వెళ్లొద్దు.

చెరువులు,వాగులు నిండుగా ఉన్నాయి కాబట్టి వాటి వద్దకు వెళ్ళవద్దు.వాతావరణ తడిగా ఉన్నందున కరెంట్ స్థంబాల వద్దకు వెళ్ళవద్దు.సాధారణ ప్రజలు కరెంట్ రిపేర్ పనులు చేయవద్దు.వర్షం ప్రభావంతో చలి తీవ్రత ఉన్నందున పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రయాణ సమయంలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.రోడ్లపై వర్షం నీరు చేరడం వల్ల వాహనాలు అదుపుతప్పి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.

వాహనాలు వేగంగా నడపవద్దు.వర్షం పడే సమయంలో ప్రయాణాలు చేయకుండా వీలైతే వాయిదా వేసుకోవాలి.

జాతీయ రహదారి (ఎన్ హెచ్ 65) పై వాహనదారులు నెమ్మదిగా వెళ్ళాలి.వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తగా ఉండాలి.

పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube