కొంతమంది హీరోయిన్లకి అందం, అభినయం నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్నటువంటి సంఘటనల కారణంగా వెండి తెరపై తళుక్కున మెరిసి తెరమరుగైన హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.కాగా తెలుగులో 2008వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన “ఒంటరి” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన మలయాళ బ్యూటీ “భావన” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన ప్రతిభను నిరూపించుకోవడంతో టాలీవుడ్ లో కూడా వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంది.ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, సీనియర్ హీరో శ్రీకాంత్ రవితేజ తదితర స్టార్ హీరోల సరసన నటించే ప్రేక్షకులని బాగానే అలరించింది.
కానీ ఏమైందో ఏమో గాని ఉన్నట్లుండి నటి భావన ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.అయితే ఆ మధ్య నటి భావన త్రిసూర్ నుంచి కొచ్చి కి కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేయడానికి యత్నించారు.
ఈ సంఘటన జరిగిన తరువాత నటి భావన కొంత కాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.ఆ తరువాత 2018 వ సంవత్సరంలో కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన “నవీన్” అనే ప్రముఖ సినీ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఆ తర్వాత సమస్యలు తీరిపోవడంతో మళ్లీ సినిమాల్లో నటిస్తోంది.అయితే ప్రస్తుతం నటి భావన టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రముఖ నటుడు మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్నట్లు పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకు నటి భావన మాత్రం తాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి భావన తెలుగులో చివరగా 2012వ సంవత్సరంలో రవితేజ హీరోగా నటించిన “నిప్పు” అనే చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించింది.ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా చిత్రాల్లో నటించలేదు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కన్నడ భాషలో దాదాపుగా నాలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో ఇప్పటికే “గోవిందా గోవిందా” అనే చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.