రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవంను నిర్వహించారు.
విద్యార్థులు తక్కువ ఖర్చుతో తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించడం జరిగింది.సుమారు 66 ప్రాజెక్టులను ప్రదర్శించారు.
మిగతా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించడం జరిగింది.ప్రదర్శన తిలకించిన అనంతరం క్విజ్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు మధుమాలతి మాట్లాడుతూ విద్యార్థులందరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సైన్స్ పట్ల ఆసక్తిని చూపించుకోవాలని, మూఢ నమ్మకాలు నమ్మద్దు అని అన్నారు.ఈ కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులు హజు నాయక్, రమేష్ రెడ్డి, రామామనోహర్ రావు, సదానందం,ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు,విద్యార్థిని,, విద్యార్థులు పాల్గొన్నారు.