వికలాంగులకు బస్సు పాసులు ఇప్పించిన గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండలం బొప్పాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 24 మంది వికలాంగులను గుర్తించి సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి తన సొంత డబ్బులతో బస్సు పాసులు ఇప్పించడం జరిగింది.

 Village Sarpanch Kondapuram Bal Reddy Gave Bus Passes To The Disabled-TeluguStop.com

సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి( Kondapuram Balreddy ) మాట్లాడుతూ వికలాంగుల సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం ఆర్టీసీ బస్సు( RTC bus )లో వికలాంగులు ప్రయాణిస్తే 50% మాత్రమే డబ్బులు చెల్లించవలసి ఉంటుందని, వికలాంగుల కోసం ప్రతి బస్సులో ప్రత్యేక సీటు ఏర్పాటు చేయడం జరిగిందని, వికలాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని వీరికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ల్యాగల నారాయణ, చల్ల మహేందర్, పోచంపల్లి పోచయ్య, జక్కుల మహేందర్, షేక్ వాయిద్, వంగ సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube