పెద్దగుట్టలో మొక్కులు చెల్లించుకుంటున్న ఆది

రాజన్న సిరిసిల్ల జిల్లా :శాసన సభ ఎన్నికల్లో వేములవాడ నియోజక వర్గం ఎమ్మెల్యే గా ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) గెలుపొందాలని కోనరావు పేట మండలం బావుసాయి పేట ఎంపీటీసీ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా లు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం( Varni ) పెద్దగుట్ట సయ్యద్ షాదుల్లా బాబా దర్గా కు మొక్కుకున్నారు.

 Aadi Is Paying Prayers In Pedgutta-TeluguStop.com

ఆది శ్రీనివాస్ అఖండ విజయం సాధించడంతో యాస్మిన్ ఫిరోజ్ పాషాలు బావుసయిపేట గ్రామం నుండి పెద్దగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు.

పాదయాత్ర షాదుల్లా బాబా క్షేత్రానికి చేరుకున్నారు.మొక్కు చెల్లించే కార్యక్రమంలో భాగంగా వేములవాడ( Vemulawada ) శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా సాదుల్లా బాబాకు చాదర్ సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం పెద్దగుట్ట లో ప్రాంతంలో సహపంక్తి భోజనాలు చేశారు.కార్యక్రమం లో జగన్మోహన్ రెడ్డి , చింతపంటి రామస్వామి, ప్రభాకర్, పులి సత్యం ,అబ్దుల్ రషీద్, కనికరపు రాకేష్ , దేవరాజు, వేములవాడ, కోనరావుపేట, చందుర్తి ,మండలాల కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube