కరోనా కు ముందు ఓటిటి ల బిజినెస్ ఎలా ఉన్న కరోనా తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.ఎందుకంటే కరోనా సమయంలో థియేటర్స్ ఓపెన్ కాలేక పోవడంతో అందరు ఓటిటి ను ఆశ్రయించారు.
చాలా సినిమాలు కరోనా సమయంలో ఓటిటి లోనే రిలీజ్ అయ్యాయి.దీంతో ఓటిటి ల డిమాండ్ బాగా పెరిగింది.
ప్రెసెంట్ అందరి చూపు ఓటిటి లపైనే పడింది.
ఓటిటి లను ఎక్కువగా ఇష్టపడడానికి మరొక కారణం కూడా ఉంది.
ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని కుటుంబం మొత్తం కలిసి సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.ఇక ప్రేక్షకులు ఇప్పుడు ఓటిటి నే ఇష్టపడడంతో స్టార్స్ కూడా వీటిపైనే ద్రుష్టి పెట్టారు.
ఇప్పటికే చాలా మంది స్టార్స్ ఓటిటి లో నటించడానికి మొగ్గు చూపుతున్నారు.హీరో, హీరోయిన్స్ సైతం ఓటిటి లో నటించేందుకు వెనకడుగు వేయడం లేదు.
అలాగే స్టార్ హీరోయిన్ సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ 2 ద్వారా ఓటిటి లోకి పరిచయం అయినా విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు చై కూడా సామ్ బాటలోనే నడుస్తున్నాడు.ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న చైతూ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.అందులో ఒకటి ఓటిటి కోసమే అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.
చై కూడా ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేసాడు.ఒక హర్రర్ కథతో వస్తున్నా సినిమాలో విలన్ గా చై నటిస్తున్నట్టు తెలిపాడు.నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు చై ఒప్పుకోవడంతో చాలా మంది ఆశ్చర్య పోయారు.హర్రర్ సినిమా అంటే కొంచెం కష్టంగా కూడా ఉంటుంది.కానీ అలంటి సినిమాలో నటించడానికి ఒప్పుకోవడంతో అక్కినేని ఫాన్స్ ఖుషీ అవుతున్నారు.చైకు ఈ పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్టు తెలిపాడు.
అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న ఈ సినిమాను విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నట్టు తెలిపాడు.ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.అయితే చైతు కు హర్రర్ సినిమాలంటే భయం అని అందరికి తెలిసిందే కానీ ఇప్పుడు ఏకంగా హర్రర్ సినిమాలోనే నటిస్తుండడం వల్ల చైతూ లో చాలా మార్పులు వచ్చాయని.ఈ విషయంలో సామ్ ను ఫాలో అవుతున్నాడని చెప్పుకుంటున్నారు.