వరంగల్ టీఆర్ఎస్ నేతలు బీజేపీ పార్టీ నాయకులపై ఫైరయ్యారు.హనుమకొండలోని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నివాసంలో కడియం శ్రీహరితో పాటు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ మీడియా సమావేశం నిర్వహించారు.
వరంగల్ లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదన్నారు కడియం శ్రీహరి.మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ నాయకులని విమర్శించారు కడియం శ్రీహరి.
గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ఎద్దేవాచేశారు.సంజయ్ ఇది ఉద్యమాల గడ్డా, టీఆర్ఎస్ గడ్డా, ఖబడ్దార్.కేసీఆర్ ను విమర్శించే అర్హత సంజయ్ కు లేదని మండిపడ్డారు.మధ్యప్రదేశ్, అస్సాం సీఎంలకు మతి ఉందా.? తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకనే బీజేపీ రాష్ట్రంపై దాడి చేస్తోందన్నారు.బీజేపీ సీఎంలు, మంత్రులు, నాయకులు సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.ఉద్యోగుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు.తెలంగాణలో ఉద్యోగుల జీతాలు చూసి మాట్లాడండి, కేంద్ర ప్రభుత్వంకు అన్ని సంస్థలను అమ్ముకోవడమే తెలుసన్నారు.బీజేపీ వ్యతిరేక శక్తులను సీఎం కేసీఆర్ ఏకం చేస్తారన్నారు.