‘ధడక్’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అలనాటి తార, అతిలోక సుందరి తనయ జాన్వి కపూర్. తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే పలు చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న జాన్వికపూర్ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే జాన్వికపూర్ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ లుక్ లో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న జాన్వీకపూర్ తాజాగా ఎవరూ ఊహించని విధంగా అచ్చం అతిలోక సుందరిలా లంగా ఓనీ ధరించి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఆ దీపావళి పండుగను పురస్కరించుకొని జాన్వి కపూర్ లంగావోని ధరించి అచ్చం తన తల్లి మాదిరి ముస్తాబయ్యి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటోలను చూసి శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు.ఈ క్రమంలోనే అచ్చం అమ్మలాగే ఉందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇక దీపావళి పండుగ సందర్భంగా బోనికపూర్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకున్నారు.