స్ట్రెచ్చర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
డాక్టర్ ను కలిసేందుకు రెండో అంతస్తుకు తీసుకెళ్లాల్సి రావడంతో రోగిని ఈడ్చుకెళ్లారని తెలుస్తోంది.స్ట్రెచ్చర్ కానీ వీల్ చైర్ కానీ అందుబాటులో లేకపోవడంతో ఆ విధంగా తీసుకెళ్లారని వాదనలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.