కాంగ్రెస్ ప్రచారం.. ఆరు గ్యారంటీలపై భరోసా

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ఇంటింటి ప్రచారం చేసిన మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, నాయకులు, గ్రామ శాఖ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వాళ్లకు భరోసా కల్పిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని, దోచుకున్నా విధానాన్ని బిజెపి ప్రభుత్వం దేశాన్ని దోచుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకున్న విధానాన్ని ఎండగడుతూ ప్రతి ఒక్కరికి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొంటూ

 Congress Party Campaign On Six Guarantees At Tangallapalli Mandal,congress Party-TeluguStop.com

తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీకి అండగా ఉంటూ కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.చీర్లవంచ గ్రామ ప్రజలు రైతులు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీకి మేము సైతం అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది.

రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు, రైతులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube