రాజన్న సిరిసిల్ల జిల్లా:బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అద్వర్యం లో సిరిసిల్ల ట్రాఫిక్ పోలీసు సిబ్బంది కి గ్లూకోజ్, ఎనర్జీ డ్రింక్ లను ట్రాఫిక్ ఎస్ఐ సముద్రల రాజు కు , బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ చే పంపిణీ చేయడం జరిగింది.అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ ఎర్రటి ఎండలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఉదయం నుండి సాయంత్రం వరకు విది నిర్వహణలో ఉంటూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి తమ వంతు సహాయం గా గ్లూకోస్, ఎనర్జీ డ్రింక్ లను పంపిణీ చేశామన్నారు.
సమాజ సేవలో ముందు ఉంటూ ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన బిసి విద్యార్థి సంఘం ముందుంటుందని అన్నారు.ఈ కార్యక్రమనికీ ఎస్ఐ రాజు సహకరించి వచ్చిందుకు ధన్యవాదాలు అన్నారు.
అనంతరం ఎస్ఐ రాజు మాట్లాడుతూ పోలీసు వాల్ల కష్టాన్ని చూసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ని అభినందించడం జరిగింది.ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరెన్నో చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.