1.వరద నష్టం పై కేంద్ర బృందం అంచనా
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కొనాల్ సత్యరెడ్డి నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ బృందం సోమవారం నుంచి తెలంగాణలోని వరుస ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయనుంది.
2.పోలవరం ప్రాజెక్టుపై ఉండవల్లి కామెంట్స్

పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, ఇంకా పునాదుల్లోనే ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Vundavalli Aruna Kumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
3.మన్ కీ బాత్ పై పురందేశ్వరి కామెంట్స్

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రాజకీయాలకు మూడు పెట్టవద్దని ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు.
4.తెలంగాణ సిఐడి ఎస్పీపై కేసు నమోదు
తెలంగాణ సిఐడి ఎస్పీ కిషన్ సింగ్ పై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేశారు.కొత్తపేటలోని TSSPDCL సీనియర్ అసిస్టెంట్ కు సిఐడి ఎస్పి కిషన్ సింగ్ వేధింపులకు గురు చేయడంతోనే ఈ కేసు నమోదు అయింది.
5.శ్రీవారి ఆలయంలో స్టీల్ హుండీలు

తిరుమల శ్రీవారి ఆలయంలో స్టీల్ హుండీలను ప్రయోగాత్మకంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
6. మహారాష్ట్ర పర్యటనకు కేసీఆర్

ఆగస్టు ఒకటిన మహారాష్ట్ర పర్యటనకు బిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) వెళ్ళనున్నారు.
7.వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన
తెలంగాణలోని వల్ల ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు.
8.నరసాపురం ధర్మవరం రైలు తప్పిన ప్రమాదం

నెల్లూరు జిల్లా కావలి బిట్రగుంట రైల్వే స్టేషన్లో మధ్య పెను ప్రమాదం తప్పింది.ఈరోజు తెల్లవారుజామున నరసాపురం నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్ప్రెస్ ఈ ప్రమాదం నుంచి బయటపడింది కావలి బిట్రగుంట మధ్య ఎగువ మార్గంలో ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెండు మీటర్ల రైలు పట్టా ముక్క ను ట్రాక్ పై అడ్డంగా పెట్టారు.దానిని రైలు ఢీకొట్టగానే అది దూరంగా పడిపోయింది.దీంతో పెను ప్రమాదం తప్పింది.దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
9.ఆగస్టు 6 వరకు పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు
కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను వరదలు ,మూడు లైన్లు నిర్మాణ పనులు కారణంగా మరో ఆరు రోజులు పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
10.చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన
ఆగస్టు ఒకటో తేదీ నుంచి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు.
11.గోదావరి వరద పరిస్థితిపై కేసీఆర్ సమీక్ష
గోదావరి వరద పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
12.ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్
ఆగస్టు 6న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.
13.మణిపూర్ లో భారీ ర్యాలీ
జాతుల మధ్య ఘర్షణతో మణుగూరులో పరిస్థితులు ఉదృక్తంగా మారాయి.మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇంపాల్ లో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు.
14.ఖమ్మంలో అగ్నివీర్ నియామక ర్యాలీ

త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి సంస్కరణలు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం అగ్నిపర్తి కార్యక్రమాన్ని రూపొందించింది .దీనిలో భాగంగా సెప్టెంబర్ ఒకటి నుంచి ఖమ్మంలో అగ్ని వీర్ నియామక ర్యాలీ చేపట్టనుంది.
15.12 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించాం
గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద పోటెత్తి అనేక గ్రామాలు ముంపున బారిన పడ్డాయి .ఈ ప్రాంతాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు.పునరావస కేంద్రాల్లో ఏర్పాటులను పరిశీలించి అనేక సూచనలు చేశారు.ఇప్పటివరకు 12,000 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అజయ్ తెలిపారు.
16.బాధితులను కేంద్రం ఆదుకుంటుంది
తెలంగాణలోని వరద బాధిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు.మోరం పల్లెలో పర్యటించిన కిషన్ రెడ్డి వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాలు వచ్చాయని, నష్టాన్ని అంచనా వేస్తున్నాయని , ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు.
17.పిఎం కిసాన్ 14వ విడత నిధులు విడుదల
పీఎం కిసాన్ నిధి పథకం కింద 14వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
18.మొక్కల పంపిణీలో పాల్గొన్న హరీష్ రావు
సిద్దిపేటలో మున్సిపాలిటి ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు మొక్కల పంపిణీలో పాల్గొన్నారు.
19.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
20.నేడు పిఎస్ఎల్వి – సీ 56 ప్రయోగం
కోటలోని సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి నేడు పిఎస్ఎల్వీ సీ 56 అంతరిక్ష నౌకను ఈరోజు ఉదయం ప్రయోగించారు.