మన మతిమరుపొడి ప్రియురాలు .అదే మన లావణ్య త్రిపాఠి .
తెలుగు జనాలు తనకు ఏమి తక్కువ చేయలేదు అంటోంది .ఎవరైనా బాలివుడ్ అంటే ఎగిరి గంతేస్తారు .కాని లావణ్య మాత్రం నచ్చిన కథ దొరికితే తప్ప బాలివుడ్ వైపు కన్నెత్తి చూడను అంటోంది .అమ్మడు బాలివుడ్ గురించి ఏం చెప్పిందో మీరే చదవండి
“బాలివుడ్ అవకాశాలు రాలేదు అని అనను కానీ, వచ్చాయి.చెప్పానుగా ఏ కథ నాకు అంత త్వరగా నచ్చదు.సినిమాలు లేకుండా ఖాళీగా కూర్చోమన్నా ఆనందంగా కూర్చుంటాను.కానీ, నచ్చని సినిమా మాత్రం చేయను.అయినా నా మొదటి ప్రాధాన్యత దక్షిణాదికే.
ఆ తరువాతే ఉత్తరాదికి.అయినా నాకు తెలుగు వాళ్ళు ఏం తక్కువ చేసారని నేను పక్క దారులు వెతుక్కోవాలి.
తెలుగు మాట్లాడటం రాకపోయినా, బాగానే అర్థమవుతోంది.నా పాత్రకు సంబంధించి డైలాగులన్నీ బాగా చదువుకుని ప్రిపేరవుతా! నాతో పాటు మిగతా వారి డైలాగులు కూడా తెలుసుకుంటా.
ఎందుకంటే మిగతా పాత్రల గురించి తెలుసుకోగలిగితేనే బాగా నటించగలం.తెలుగులో వచ్చినట్టు మంచి కథతో బాలివుడ్ వాళ్ళు వస్తే తప్పకుండా చేస్తా !”
భలే భలే మొగాడివోయ్ తో బంపర్ హిట్ అందుకున్న ఈ అందాల రాక్షసి ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా’ , ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమాలు చేస్తోంది.
అల్లు శిరీష్తో ఓ సినిమా ప్రారంభం కానుంది.