టాలీవుడ్లో ‘బాహుబలి’ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘రుద్రమదేవి’.ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయ్యింది.
అయితే నిర్మాణానంతర కార్యక్రమాల వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది.గత సంవత్సరం విడుదల అవుతుందని చెప్పిన ఈ సినిమా ఇప్పటి వరకు కూడా విడుదలకు నోచుకోలేదు.
గత నెలలో ఈ సినిమా ఆడియో విడుదల సందర్బంగా ఏప్రిల్ లేదా మేలో ఈ సినిమా విడుదల చేస్తానంటూ దర్శక నిర్మాత గుణశేఖర్ ప్రకటించాడు.అయితే ఏప్రిల్ పూర్తి అవ్వబోతుంది, మే కూడా రాబోతుంది.
ఇప్పటి వరకు కూడా రుద్రమ సైలెంట్గానే ఉంది.
భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ రోల్లో అనుష్క నటించగా, రానా ముఖ్య పాత్రలో నటించాడు.
ఇక మెగా హీరో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించి సినిమాపై అంచనాలు పెంచాడు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా రీ రికార్డింగ్ను సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రస్తుతం లండన్లో భారీ ఖర్చు చేస్తూ చేస్తున్నాడు.
ఎప్పటికి ఈ రీ రికార్డింగ్ అయ్యేనో, ఎప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యేనో అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.