సిద్దిపేట జిల్లా( Siddipet )లో భారీ వర్షం కురిసింది.నంగనూరు మండలం( Nanganoor ) సిద్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో పాటు కొట్టుకుపోయింది.
ఆరుగాలం పండించిన పంట తడిసి పోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
అయితే ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షం పడుతోంది.దీంతో పలు ప్రాంతాల్లో అన్నదాతలు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.