కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ కు ( Kodi Kathi Srinivas ) బెయిల్ వచ్చింది.ఈ మేరకు శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు( AP High Court ) షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
కాగా వైఎస్ జగన్ పై( YS Jagan ) దాడి కేసులో శ్రీనివాస్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే కోడికత్తి కేసులో బెయిల్( Bail ) మంజూరు చేయాలని కోరుతూ శ్రీనివాస్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
గతంలో ఈ బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం జనవరి 24వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.తాజాగా షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.ఈ క్రమంలోనే వారానికి ఒక్క రోజు ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలని తెలిపింది.అలాగే కేసు విషయంపై మీడియాతో మాట్లాడవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.