తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో రమణయ్య( MRO Ramanaiah ) హత్య కేసును చేధించామని విశాఖ సీపీ రవిశంకర్ తెలిపారు.ఘటన చోటు చేసుకున్న ఆరు గంటల్లోనే నిందితుడిని గుర్తించామని పేర్కొన్నారు.
ఈ క్రమంలో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
అలాగే నిందితుడు చాలా సార్లు ఎమ్మార్వో కార్యాలయానికి కూడా వెళ్లినట్లు గుర్తించామని సీపీ రవిశంకర్( CP Ravishankar ) వెల్లడించారు.రియల్ ఎస్టేట్, భూ వివాదాలే రమణయ్య హత్యకు కారణమని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.అయితే నిన్న రాత్రి చినగదిలి రూరల్ ఎమ్మార్వో( Chinagadili Rural MRO ) రమణయ్యపై చరణ్ క్యాస్టల్ అపార్ట్ మెంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాడ్ తో దాడి చేయగా.
ఆయన చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.