కోడలిపై( Daughter-in-law ) తన భర్త కన్నేసి లైంగికంగా వేధిస్తున్నాడని తెలియడంతో అత్యంత దారుణంగా భర్త గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదాయూ పట్టణంలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) లోని బదాయూ పట్టణంలో తేజేంద్ర సింగ్, మిథిలేశ్ దేవి అనే దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి నలుగురు పిల్లలు సంతానం.
తేజేంద్ర సింగ్ ఒక తాళ్ల వ్యాపారి.అయితే తేజేంద్ర సింగ్ ఆగస్టు 14వ తేదీ తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులను విచారించగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు చెప్పారు.
కానీ తేజేంద్ర సింగ్( Tejendra Singh ) భార్య మిథిలేశ్ దేవి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది.ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు( Police ) విచారణ చేయగా.ఆమె తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయి అసలు నిజం ఏమిటో పోలీసులకు చెప్పేసింది.
తన భర్త తేజేంద్ర సింగ్ ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి తనను విచక్షణారహితంగా కొడుతూ నరకం చూపించేవాడని, భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టిన తాను భరిస్తూనే ఉన్నానని తెలిపింది.తన భర్త తన కుమారుడి భార్యపై కన్నేసి తనతో లైంగిక సంబంధానికి కోడల్ని ఒప్పించమని తనను బలవంతం చేయడం మొదలు పెట్టాడని తెలిపింది.పూర్తిగా సహనం కోల్పోయిన తాను భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.ఆగస్టు 13వ తేదీ రాత్రి పీకల దాకా మద్యం తాగి వచ్చిన భర్త విపరీతంగా గొడవకు దిగి ఆ తర్వాత ఇంటి బయట ఉండే మంచంపై పడుకున్న సమయంలో ఇదే అదునుగా భావించిన తాను కొడవలితో తన భర్త గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది.