తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్య నేతలను అధిష్టానం ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్, ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లగా బండి సంజయ్ ఇప్పటికే హస్తినలో ఉన్నారన్న సంగతి తెలిసిందే.తెలంగాణలో పార్టీ పరిస్థితిపై బీజేపీ పెద్దలు చర్చించనున్నారని సమాచారం.
అదేవిధంగా రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది.