అమెరికాలో భారతీయ పండుగలకు ఇటీవలి కాలంలో మంచి గుర్తింపు లభిస్తోంది.భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఈ పండుగలలో పాల్గొంటున్నారు.
దసరా, దీపావళి, వినాయక చవితి తదితర పర్వదినాలను ఘనంగా జరుపుకోవడంతో పాటు కొన్ని పండుగలకు సెలవులు కూడా ఇస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు.తాజాగా సిక్కుల పర్వదినం వైశాఖీకి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది.
రాజధాని వాషింగ్టన్లోని ఒలింపియాలోని స్టేట్ కాపిటల్( State Capitol in Olympia, Washington )లో తొలిసారిగా వైశాఖీ పర్వదినం జరుపుకున్నారు.
సియాటిల్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా( Consulate General of India in Seattle ) సోమవారం ఒలింపియాలోని స్టేట్ కాపిటల్లో తొలిసారిగా వైశాఖి పండుగను నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గూసన్, లెఫ్టినెంట్ గవర్నర్ డెన్నీ హెక్,( Governor Bob Ferguson, Lieutenant Governor Denny Heck, ) విదేశాంగ కార్యదర్శి స్టీవ్ హాబ్స్, రాష్ట్ర సెనేటర్లు, రాష్ర శాసనసభ సభ్యులు, వాషింగ్టన్కు చెందిన సిక్కు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫెర్గూసన్ మాట్లాడుతూ వాషింగ్టన్లోని ఇండియన్ అమెరికన్ సిక్కు సమాజం సహకారాన్ని స్వాగతించారు.
ఒలింపియాలోని స్టేట్ క్యాపిటల్లో తొలిసారిగా వైశాఖి వేడుకలను నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

వాషింగ్టన్ గవర్నర్ కూడా వైశాఖి ( Vaisakhi )సందర్భంగా ప్రత్యేక ప్రకటనను జారీ చేశారు.అలాగే కింగ్ కౌంటీ, స్నో హోమిష్ కౌంటీతో పాటు గ్రేటర్ సీటెల్ ఏరియాలోని 39 నగరాలను, కెంట్, మేరీస్విల్లే నగరాలను కవర్ చేస్తూ ఏప్రిల్ 14ని గ్రేటర్ సీయాటెల్ ప్రాంతంలో వైశాఖ దినోత్సవ వేడుకగా ప్రకటిస్తూ ప్రత్యేక ప్రకటనలు జారీ చేసింది.వాషింగ్టన్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇండో అమెరికన్లు, సిక్కు కమ్యూనిటీ సభ్యులు నివసిస్తోంది.
వీరిలో ఎక్కువ మంది చిన్న, మధ్య తరహా సంస్థలు తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

సిక్కులు రాష్ట్ర సాంస్కృతిక, ఆర్ధిక వైవిధ్యాన్ని సుసంపన్నం చేసే ప్రజాసేవ నిమిత్తం చురుకుగా కృషి చేస్తున్నారని ఇండియన్ కాన్సులేట్ తెలిపింది.గ్రేటర్ సియాటిల్ ప్రాంతానికి వారు చేసిన సానుకూల కృషికి ఈ సందర్భంగా కమ్యూనిటీకి చెందిన కొంతమంది ప్రముఖ నాయకులను గుర్తించి సత్కరించారు.