వయసు పెరిగే కొద్దీ ముడతలు, చర్మం సాగటం, చర్మంపై గీతలు తదితర వృద్ధాప్య లక్షణాలన్నీ తలుపు తడుతుంటాయి.వీటి వల్ల ముఖంలో కాంతి తగ్గడమే కాదు ఆత్మ విశ్వాసాన్ని కూడా కోల్పోతుంటారు.
ఈ జాబితాలో మీరు ఉండకూడదు అంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్ ను పాటిస్తే సరి.ఈ టిప్ ను పాటిస్తే కనుక అరవైలోనూ యంగ్ గా మెరిసిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో రెండు నుంచి మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి ఒక చిన్న కప్పు వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఖర్జూరాలను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు పాల మీగడ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో స్మూత్ పేస్ట్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.చర్మం కంప్లీట్ గా డ్రై అయిన అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే ముఖం ఎల్లప్పుడూ యవ్వనంగా మరియు ఆరోగ్యంగా మెరిసిపోతోంది.
చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది.వయసు పెరిగిన వృద్ధాప్య లక్షణాలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఈ చిట్కాను పాటించడం వల్ల చర్మం తెల్లగా కాంతివంతంగా సైతం మారుతుంది.
కాబట్టి తప్పకుండా ఈ టిప్ ను పాటించేందుకు ప్రయత్నించండి.అందంగా యవ్వనంగా మెరిసిపోండి.