గర్భిణీ స్త్రీలలో కామన్గా కనిపించే సమస్యల్లో అధిక ఒత్తిడి ఒకటి.అందులోనూ మొదటి సారి గర్భం దాల్చిన మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిస్తుంటుంది.
నెలలు గడుస్తున్న కొద్ది ఏవేవో ఆలోచిస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు.ఆ ఒత్తిడి వల్ల వారి కాదు.
వారి కడుపులోకి బిడ్డ కూడా ఎఫెక్ట్ అవుతారు.అందుకే ఆ సమయంలో ఒత్తిడిని ఎంత అదుపులో ఉంచుకుంటే తల్లికి, బిడ్డకు అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే అందుకు కొన్ని యోగాసనాలు అద్భుతంగా సహాయపడతాయి.మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ యోగాసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తే బెస్ట్ యోగాసనాల్లో ప్రాణాయామ ఒకటి.ప్రతి రోజు ప్రశాంతంగా, శుభ్రంగా ఉన్న చోట కూర్చుని కాసేపు ప్రాణాయామ చేస్తే ఒత్తిడి సమస్య దూరం అవుతుంది.
శారీరకంగానూ, మానసికంగానూ దృఢంగా మారతారు.రక్త పోటు కంట్రోల్లో ఉంటుంది.
మరియు ప్రాణాయామం చేయడం వల్ల బర్భినీల్లో శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ చక్కగా పెరుగుతాయి.
గర్భిణీ స్త్రీలలో అధిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా నిద్ర కూడా సూపర్గా సహాయపడుతుంది.
రోజు యోగ నిద్ర చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గు ముఖం పడతాయి.తలనొప్పి రాకుండా ఉంటుంది.శరీరం ఫుల్గా రిలాక్స్ అయిపోతుంది.మరియు యోగ నిద్ర సుఖ ప్రసవానికి హెల్ప్ చేస్తుంది.
ధ్యానం కూడా ప్రెగ్నెంట్ స్త్రీలలో ఒత్తిడిని సులభంగా నివారిస్తుంది.ప్రతి రోజు పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు ధ్యానం చేశారంటే మీలో ఉండే ఒత్తిడి చిత్తైపోతుంది.అంతే కాదు, ధ్యానం వల్ల మనసు ప్రశాంతగా మారుతుంది.మరియు డెలివరీ సమయంలో ప్రసవ వేదనను తట్టుకునే శక్తి లభిస్తుంది.
గర్భిణీలకు వజ్రాసనం కూడా చాలా మేలు చేస్తుంది.రెగ్యులర్గా వజ్రాసనం వేయడం వల్ల ఒత్తిడి, ఆందోలన వంటి మానసిక సమస్య తగ్గుతాయి.
అలాగే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడి.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.