ఒక వింతైన, నవ్వు తెప్పించే వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తెలంగాణలో ఒక వ్యక్తి తన బైక్ వెనుక పౌల్ట్రీ పంజరం(Poultry cage) తగిలించుకుని, అందులో ఇద్దరు చిన్న పిల్లలను కూర్చోబెట్టుకుని(Sit down with small children) వెళ్తున్న దృశ్యం ఈ వీడియోలో ఉంది.
తెలుగు రాపర్ రోల్ రైడా ఈ క్లిప్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో, ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది, కొందరు నవ్వితే మరికొందరు ఆందోళన చెందుతున్నారు.
ఈ వీడియోను రోల్ రైడా తన ఇంటి దగ్గర, నాగర్లోని బండ్లగూడ (Bandlaguda)ప్రాంతంలో చిత్రీకరించారు.
బైక్కు అమర్చిన పెద్ద పౌల్ట్రీ(poultry) క్యారియర్లో కోళ్లు ఉండాల్సింది పోయి, ప్రశాంతంగా, హాయిగా ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.వాళ్లు ఆ పంజరంలో చాలా సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణం చేస్తున్నట్టు కనిపించారు.
అది వాళ్లకు ఓపెన్ సీటులా అనిపించింది.ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది, ఇప్పటికే 33 లక్షల వ్యూస్ను దాటేసింది.
ఇది ఆన్లైన్లో మిశ్రమ స్పందనలకు దారితీసింది.చాలా మంది ఈ వీడియోను చూసి నవ్వుకున్నారు, తెలివైన ఆలోచన అని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం అందులో ఉన్న భద్రతా ప్రమాదాలను గుర్తు చేశారు.
కామెంట్ సెక్షన్లో కొంతమంది నెటిజన్లు ఈ క్రియేటివిటీని మెచ్చుకున్నారు.ఒక యూజర్ సరదాగా కామెంట్ చేస్తూ, “ఇన్నోవేషన్ లెవెల్: తెలుగు డాడ్” అని రాశారు.మరొకరు, “ఇలాంటి ‘జుగాడ్’లు ఇండియాలోనే కనిపిస్తాయి” అని నవ్వుతూ కామెంట్ పెట్టారు.ఇంకొకరు, “మొబైల్ క్రెచ్ సర్వీస్ లా ఉంది.” అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.
మరోవైపు, చాలా మంది దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.ఒక యూజర్ హెచ్చరిస్తూ, “ఇది ఫన్నీగా అనిపించొచ్చు, కానీ పిల్లలకు చాలా ప్రమాదకరం” అని కామెంట్ చేశారు.మరొకరు, “ఒకవేళ ఏదైనా జరిగితే, బాధ్యత ఎవరు తీసుకుంటారు?” అని ప్రశ్నించారు.కొంతమంది వ్యూయర్లు పిల్లలు ఎంత సౌకర్యంగా ఉన్నారో దానిపై దృష్టి పెట్టారు.“పిల్లలు స్కూల్ వ్యాన్లలో కంటే ఎంతో హాయిగా ఉన్నారు,” అని ఒకరు అభిప్రాయపడ్డారు.“కనీసం బస్సులలో కంటే మంచి వెంటిలేషన్ ఉంది,” అని మరొకరు అన్నారు.“నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు.
” అని ఒకరన్నారు.