స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు( Nandamuri Balakrishna ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
ఈ ఏడాది ఇప్పటికే డాకు మహారాజ్( Daku Maharaj ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అఖండ2 సినిమాతో సైతం మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని నమ్మకంతో అన్నారు.
అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 ( Akhanda2 )తెరకెక్కుతుండగా 200 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.బాలయ్య భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండటం గమనార్హం.

బాలయ్య గొప్పదనం గురించి ప్రముఖ నటి రాజ్యలక్ష్మి ( Actress Rajyalakshmi )ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.అమ్మకు సర్జరీ అయిన విషయం తెలిసి బాలయ్య మా ఇంటికి వస్తానని చెప్పారని అదే సమయంలో బాలయ్య తల్లి బసవతారకం గారు కూడా మరణించారని ఆమె చెప్పుకొచ్చారు.బాలయ్య మా ఇంటికి వచ్చిన సమయంలో మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతోందని రాజ్యలక్ష్మి తెలిపారు.

ఆ సమయంలో బాలయ్య మా ఇంటి బయట వెయిట్ చేసి వ్రతం అయిపోయిన తర్వాత మా అమ్మతో మాట్లాడారని రాజ్యలక్ష్మి వెల్లడించారు.బాలయ్యకు యంగ్ హీరోలతో సైతం మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రమే బాలయ్య మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటనలు వెలువడనున్నాయి.